న్యూఢిల్లీ, మే 20 : స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసే దిశగా కీలక ముందగుడు పడింది. పుణెకు చెందిన ప్రైవేట్ రక్షణ రంగ సంస్థ ‘నిబే లిమిటెడ్’ అభివృద్ధి చేసిన ‘సూర్యాస్త్ర’ రాకెట్ ప్రయోగం సక్సెస్ అయింది. బుధవారం చాందీపూర్లో సూర్యాస్త్ర రాకెట్ వ్యవస్థ పనితీరును పరీక్షించగా, రెండు రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
150, 300 కిలోమీటర్ల రేంజ్లో సూర్యాస్త్రకు చెందిన రెండు రకాల రాకెట్లను పరీక్షించి చూసినట్టు సదరు కంపెనీ తెలిపింది. ఇందులో ఉపయోగించిన గైడెడ్ రాకెట్లు లక్ష్యాలను దాదాపు 1.5 నుండి 2 మీటర్ల కచ్చితత్వంతో తాకినట్టు పేర్కొన్నది.