న్యూఢిల్లీ, డిసెంబర్ 15: చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. అణ్వస్త్ర సామర్థ్యమున్న అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ద్వారా 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించవచ్చు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి గురువారం దీన్ని పరీక్షించా రు. అగ్ని-5 ద్వారా చైనాలోని చాలా ప్రాంతాలు సహా ఆసియా మొత్తం, యూరప్లోని కొన్ని ప్రాంతాల్లోని లక్ష్యాలను ఛేదించవచ్చని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. అగ్ని-1 నుంచి అగ్ని-4 వరకు ఉన్న క్షిపణులు 700-3,500 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదిస్తాయి. చైనా వద్ద నున్న డాంగ్ఫెంగ్-41 క్షిపణులు 12,000-15,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు.