న్యూఢిల్లీ: బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతి కోసం ఇండియా తొలి ఆర్డర్ వచ్చింది. బ్రహ్మోస్ యాంటీ షిప్ మిస్సైళ్ల కోసం పిలిప్పీన్స్ రక్షణశాఖ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్నది. సుమారు 374 మిలియన్ల డాలర్ల డీల్ కుదిరినట్లు రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఒప్పందం ఎన్ని క్షిపణులకు గురించి జరిగిందో వెల్లడించలేదు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను తయారు చేస్తోంది. వీటిని సబ్మెరైన్లు, నౌకలు, విమానాలు, భూమి మీద నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. అయితే సముద్రం నుంచి లాంచ్ చేసే క్షిపణులను కొనుగోలు చేసేందుకు పిలిప్పీన్స్ నేవీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు రక్షణశాఖ చెప్పింది.