న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 6,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,29,45,160కి చేరాయి. ఇందులో 4,23,53,620 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 5,14,388 మంది మరణించారు. మరో 77,152 మంది చికిత్స పొందుతున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, గత 24 గంటల్లో 142 మంది కరోనాకు బలవగా, 14,947 మంది కోలుకున్నారని తెలిపింది.
కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా కేరళలో ఉన్నాయి. రాష్ట్రంలో 2373 మందికి కరోనా సోకింది. ఇక మహారాష్ట్రలో 544 కేసులు, ఢిల్లీలో 325, తమిళనాడులో 320, ఉత్తరప్రదేశ్లో 216, మధ్యప్రదేశ్లో 259, హర్యానా 232 చొప్పున కేసులు నమోదయ్యాయి.