దేశానికి అత్యంత ధీశాలి అయిన వ్యక్తి ప్రధాని కావాలని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. అందర్నీ కలుపుకొని వెళ్లడం, విభజన రాజకీయాలు చేయకపోవడం వంటి లక్షణాలున్న నేత ప్రధాని కావాలని ఆకాంక్షించారు. దేశంలోని ప్రతి ఎన్నిక కూడా విభజన వైపే వెళ్తోందన్నారు. మాజీ ప్రధాని దేవేగౌడ పుస్తకావిష్కరణ సభకు ఫరూక్ అబ్దుల్లా హాజరయ్యారు. ఈ సందర్భంగానే ఆయన పై వ్యాఖ్యలు చేశారు. ”దేశానికి విషాదం అవసరమే లేదు. అత్యంత గర్హనీయమైన అంశం ఏమిటంటే దేశంలో జరిగే ప్రతి ఎన్నికా ఇటు దేశాన్ని, ఇటు దేశ ప్రజలను విడదీస్తోంది.” అని ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.