న్యూఢిల్లీ : దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. గత నాలుగైదు రోజుల నుంచి 5 వేలకు దిగువన పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. రెండు రోజుల క్రితం మూడు వేల పాజిటివ్ కేసులు నమోదు కాగా, నిన్న, ఇవాళ 4 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 4,184 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 104 మంది మరణించినట్లు పేర్కొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 44,488 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
COVID19 | India logs 4,184 new cases, 104 deaths in the last 24 hours; Active cases stand at 44,488 pic.twitter.com/dnriOt0Qhs
— ANI (@ANI) March 10, 2022