నోయిడా: ఉజ్బెకిస్తాన్(Uzbekistan)లో ఇటీవల దగ్గు మందు(Cough Syrup) తాగి కొందరు పిల్లలు మృతిచెందిన(Child Deaths) విషయం తెలిసిందే. ఆ దగ్గు మందు ఢిల్లీలోని మారియన్ బయోటెక్(Marion Biotech) సంస్థలో తయారైంది. అయితే ఆ కేసులో ఇవాళ నోయిడా పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఫార్మా సంస్థ తయారు చేసిన దగ్గు మందు తాగి .. ఉజ్బెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే.
మారియన్ బయోటెక్ సంస్థకు చెందిన అయిదుగురు అధికారులపై గురువారం రాత్రి కేసు బుక్ చేశారు. ఇద్దరు డైరెక్టర్లపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఇన్స్పెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసును ఫైల్ చేశారు.
#WATCH | We have arrested 3 people out of 5 from Marion Biotech Pvt Ltd…The case is related to the earlier case of toxic cough syrup sent abroad as the enquiry was done after the incident: Ram B Singh, DCP Central Noida pic.twitter.com/vrwTiNLJjk
— ANI (@ANI) March 3, 2023
ఇటీవల కేంద్ర, యూపీకి చెందిన డ్రగ్ అధికారులు మారియన్ బయోటెక్ శ్యాంపిళ్లను పరీక్షించారు. 22 శ్యాంపిళ్లు నాణ్యతకు తగినట్లు లేవని గుర్తించారు. ఈ కేసులో ముగ్గురి వ్యక్తుల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అయితే కంపెనీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఆపరేషన్స్ హెడ్ తుహిన్ భట్టాచార్య, మాన్యుఫ్యాక్చరింగ్ కెమిస్ట్ అతుల్ రావత్, అనలిటికల్ కెమిస్ట్ మూల్ సింగ్లను అరెస్టు చేశారు.
Uttar Pradesh | Three people arrested by Noida Phase-3 Police for manufacturing and sale of duplicate medicines. The accused have been identified as Atul Rawat, Tuhin Bhattacharya and Mool Singh and were arrested from Marion Biotech Pvt Ltd.
(Pic: Noida Police) pic.twitter.com/x316a9Vc8k
— ANI (@ANI) March 3, 2023
ఢిల్లీలోని సెక్టార్ 67లో మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ ఆఫీసు ఉంది. డాక్-1 దగ్గు సిరప్ను ఆ కంపెనీయే ఉత్పత్తి చేస్తోంది. అయితే గత ఏడాది డిసెంబర్లో ఆ దగ్గు సిరప్పై ఆరోపణలు వచ్చాయి. ఆ సిరప్ తాగిన 18 మంది పిల్లలు ఉజ్బెకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయినట్లు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ శాఖ విచారణ చేపట్టింది.