ముంబై: గత ఏడాది ముంబై నగరంలో 34 ఏళ్ల మహిళ అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు మోహన్ ఖత్వారు చౌహాన్కు ముంబై సెషన్స్ కోర్టు ఇవాళ మరణశిక్షను ఖరారు చేసింది. దేశవ్యాప్తంగా ఈ కేసు సంచలనం రేపిన విషయం తెలిసిందే. సీఎం ఉద్దవ్ ఆదేశాల మేరకు ముంబై పోలీసులు కేవలం మూడు వారాల్లోనే ఆ కేసులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ముంబైలోని సాకినాక శివారులో పార్కింగ్ చేసి ఉన్న టెంపు వాహనంలో 34 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా రేప్ చేశారు. ఈ కేసులో ఇవాళ అదనపు సెషన్స్ జడ్జి హెచ్సీ షిండే తీర్పునిస్తూ.. దీన్ని అరుదైన కేసుగా గుర్తిస్తున్నామని, బాధిత మహిళను దారుణం రేప్ చేశారని, అందుకే ఈ కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపారు.