న్యూఢిల్లీ : మీరు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారా? ఇండిగో విమానంలో ప్రయాణించాలనుకుంటున్నారా? అయితే మీకు ఇండిగో విమానయాన సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు టికెట్ రేటుపై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ఆ సంస్థ బుధవారం ప్రకటించింది. భారత్లో వ్యాక్సిన్ తీసుకున్న వారికి ప్రయాణ ఛార్జీలలో ఇండిగో సంస్థ డిస్కౌంట్ కల్పించడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు ఏ విమానయాన సంస్థ కూడా ఇలాంటి వెసులుబాటు కల్పించలేదు. గత రెండు రోజుల నుంచి 18 సంవత్సరాలు నిండిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో తొలిరోజు 88 లక్షల మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు.