న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ తో దేశవ్యాప్తంగా 646 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ శనివారం వెల్లడించింది. జూన్ 5 వరకూ ఐఎంఏ కొవిడ్-19 రిజిస్ట్రీ వివరాల ప్రకారం ఢిల్లీలో అత్యధికంగా 109 మంది డాక్టర్లు మరణించగా బిహార్ లో 97, యూపీలో 79, రాజస్థాన్ లో 43, జార్ఖండ్ లో 39, గుజరాత్ లో 37, ఏపీలో 35, తెలంగాణలో 34, బెంగాల్ లో 30 మంది వైద్యులు మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఫస్ట్ వేవ్ లో దేశంలో 748 మంది వైద్యులు మరణించారని ఐఎంఏ పేర్కొంది. ఇక భారత్ లో కరోనా వైరస్ కేసులు తగ్గముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,20,000 తాజా కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల పాజిటివిటీ రేటు 5.78 శాతానికి తగ్గింది.