తిరువనంతపురం: కేరళకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పీసీ జార్జ్ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయడాన్ని ఆయన భార్య ఉషా జార్జ్ ఖండించారు. అది తప్పుడు కేసు అని, దీని వెనుక సీఎం పినరయి విజయన్ ఉన్నారని ఆరోపించారు. భర్త పీసీ జార్జ్ అరెస్ట్పై భార్య ఉషా జార్జ్ మీడియాతో ఆదివారం మాట్లాడారు. తన కుటుంబాన్ని వేధిస్తున్న సీఎం విజయన్ను తుపాకీతో కాల్చి చంపుతానని బహిరంగంగా ఆమె బెదిరించారు. ‘ఇది ఫేక్ కేసు. కేరళ సీఎం నా భర్తను, కుటుంబాన్ని చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. నా భర్త అమాయకుడు. కేరళ సీఎం అవినీతిని బయటపెట్టాడు. అందుకే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. మా నాన్న రివాల్వర్తో సీఎంను కాల్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని ఉషా జార్జ్ అన్నారు.
కాగా, కేరళ రాజకీయ కురువృద్ధుడైన పీసీ జార్జ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై శనివారం ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు ముస్లింలకు వ్యతిరేకంగా జార్జ్ చేసిన వ్యాఖ్యలపై రెండు నెలల కిందట కూడా ఆయన అరెస్టయ్యారు. ఈ సందర్భంగా సీఎం విజయన్ తనను టార్గెట్ చేస్తున్నారని, కుట్రలో భాగంగా తనను అరెస్ట్ చేశారని జార్జ్ ఆరోపించారు.
It's a fake case. Kerala CM torturing my husband & family. My husband is innocent. He exposed Kerala CM's corruption. So Police arrested him. I'm ready to shoot the CM with my father's revolver: Usha George, wife of ex-MLA PC George, on sexual harassment case against him (02.07) pic.twitter.com/buLlV5f75G
— ANI (@ANI) July 3, 2022