న్యూఢిల్లీ: తోషాఖానా కేసులో పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan), ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ శిక్షను ఇవాళ ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. జనవరి 31వ తేదీన ఇస్లామాబాద్ అకౌంటబులిటీ కోర్టు ఆ ఇద్దరికీ శిక్షను వేసింది. ఆ తీర్పు ప్రకారం ఇమ్రాన్, ఆయన భార్య బుష్రాలు.. పదేళ్ల పాటు రాజకీయాలకు దూరం అయ్యారు. ఆ ఇద్దరికీ 787 మిలియన్ల జరిమానా కూడా విధించారు. ఈ కేసులో తదుపరి విచారణ ఈద్ వేడుకల తర్వాత ఉంటుందని ఇస్లామాబాద్ చీఫ్ జస్టిస్ ఆమిర్ ఫారూక్ తెలిపారు. తోషాఖానా కేసుతో తన భార్యకు ఎటువంటి లింకు లేదని, ఆమెను అనవసరంగా ఈ ఊబిలోకి లాగుతున్నారని ఇమ్రాన్ ఆరోపించారు.