శ్రీముఖి.. బుల్లితెర ప్రేక్షకులకి ఈ పేరు చాలా సుపరిచితం. అతి తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ నిజామాబాద్ పిల్ల తొలి సారి జులాయి చిత్రంలో కనిపించింది. ఇందులో శ్రీముఖి అద్భుతంగా నటించడంతో ఆమెకు ‘నేను శైలజ’, ‘జెంటిల్మెన్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ ఇలా పలు సినిమా ఆఫర్స్ వచ్చాయి. ప్రస్తుతం సత్తిబాబు తెరకెక్కిస్తున్న ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో లీడ్ రోల్ చేస్తోంది. అలాగే, నితిన్ కొత్త చిత్రం ‘మాస్ట్రో’లోనూ ఛాన్స్ దక్కించుకుంది.
వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా శ్రీముఖి సందడి మాములుగా ఉండదు. అదుర్స్ అనే షోతో యాంకర్ అవతారం ఎత్తిన శ్రీముఖి ఆ తర్వాత మనీన మనీ, సూపర్ మామ్, పటాస్, జోలకటక, కామెడీ నైట్స్ ,బొమ్మ అదిరింది ఇలా ఎన్నో కార్యక్రమాలతో పలు ఈవెంట్స్ను సైతం హోస్ట్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 3లోను తెగ సందడి చేసింది. అయితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే శ్రీముఖి ఇటీవలి కాలంలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యూత్కు థ్రిల్ అందిస్తుంది. తాజాగా లంగా ఓణీలో దిగిన ఫొటోలు షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.