ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వైమానిక దళం యుద్ధానికి సన్నద్ధంగానే వుండాలని ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరీ పిలుపునిచ్చారు. ఎం తక్కువ సమయంలో ఆదేశాలిచ్చినా, యుద్ధానికి మాత్రం సన్నద్ధంగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. కొన్ని ఆపరేషన్లు చేయాల్సి రావొచ్చని, అందుకు సర్వ సన్నద్ధంగా ఉండాలని ఆయన సూచించారు.
ఓ జాతీయ సెమినార్లో ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రసంగించారు. ప్రస్తుత భౌగోళిక, రాజకీయ పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అయితే… ఏ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని, ఈయన ఈ వ్యాఖ్యలు చేశారన్నది మాత్రం తెలియడం లేదు. అయితే.. రష్యా- ఉక్రెయిన్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొనే ఈ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.
ఏ క్షణంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నా.. పోరాడేందుకు సన్నద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దానికి సంబంధించిన ఆయుధ సామాగ్రిని కూడా సమకూర్చుకోవాలన్నారు. ఎలాగైనే లద్దాఖ్ ప్రాంతంలో జరుగుతున్నట్లు గానే.. ఎక్కువ కాలం కూడా యుద్ధం జరిగే ఛాన్స్ ఉందని, సన్నద్ధంగా ఉండాలని ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌధరీ వైమానిక దళానికి సూచించారు.