డెహ్రాడూన్: తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి దక్కడం ఎంతో సంతోషంగా ఉన్నదని పుష్కర్సింగ్ ధామి తల్లి విష్ణాదేవి చెప్పారు. అయితే, ఈ సమయంలో కొడుకును రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూసుకోవడానికి అతడి తండ్రి లేకపోవడం కొంచెం బాధగా ఉన్నదని ఆమె పేర్కొన్నారు. పుష్కర్ ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడని ఆమె గుర్తుచేసుకున్నారు. అదేవిధంగా పుష్కర్సింగ్ భార్య గీత కూడా తన భర్త రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంపై సంతోషం వ్యక్తంచేశారు.
తన భర్తకు ఈ స్థాయికి కట్టబెట్టిన బీజేపీ అధిష్టానానికి, ప్రధాని నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, రాజ్నాథ్ సింగ్కు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు, ఖతిమా నియోజకవర్గ ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. తన భర్త మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడని, ప్రజల సమస్యలపై ఆయనకు ఎంతో అవగాహన ఉన్నదని గీత పేర్కొన్నారు.