భోపాల్: కరోనాతో చనిపోయిన రోగి మృతదేహం అంబులెన్స్ నుంచి రోడ్డుపై పడింది. మధ్యప్రదేశ్లోని విదిషా జిల్లా ఆసుపత్రి వద్ద ఈ ఘటన జరిగింది. ఆసుపత్రి నుంచి కరోనా రోగుల మృతదేహాలతో వెళ్తున్న ఒక అంబులెన్స్ గేట్ వద్ద టర్న్ తీసుకొంటుండగా అందులోంచి ఒక రోగి మృత దేహం రోడ్డుపై పడింది. దీంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపాడు. పీపీఈ కిట్లు ధరించిన ఇద్దరు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు.
కాగా, మార్ఫిడ్ చేసిన ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. మరోవైపు ఆ కరోనా రోగి చికిత్స పొందుతూ చనిపోయిన సంగతిని ఆసుపత్రి సిబ్బంది బంధువులకు తెలియజేయకుండానే మృతదేహాన్ని అంబులెన్స్లో తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి.