న్యూఢిల్లీ: కొవిడ్ టీకాల విషయంలో వయసు నిబంధనను ఎత్తివేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రివాల్ అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తాను కేంద్రానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశానని, అయినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆయన చెప్పారు. ఢిల్లీలో 65 శాతం మంది 35 ఏండ్ల లోపువారే ఉన్నారని, కేంద్రం టీకాలపై వయసు నిబంధనను తొలగిస్తే అందరికీ టీకాలు వేసుకునే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. అందరికీ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వం ఇంటింటికీ కరోనాపై అవగాహన కల్పించడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు.