న్యూఢిల్లీ ;డిక్లరేషన్ను ఆమోదించడంలో కీలకంగా పనిచేసిన హైదరాబాద్కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి కాకనూరు నాగరాజు నాయుడు.. షెర్పా అమితాబ్ కాంత్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. జీ20లో సంక్లిష్టమైన భాగమైన భౌగోళిక రాజకీయ అంశంపై(రష్యా-ఉక్రెయిన్)పై ఏకాభిప్రాయం తీసుకురావడంలో నాగరాజు కీలక పాత్ర పోషించారు. నాగరాజు నాయుడు సెయింట్ పాట్రిక్స్ స్కూల్ విద్యార్థి. నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం, హాంకాంగ్లో భారత కాన్సులేట్లో పనిచేసిన నాగరాజు నాయుడు.. చైనీస్(మాండరిన్) అనర్గళంగా మాట్లాడగలరు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 76వ సెషన్ అధ్యక్షుడికి ‘చెఫ్ డి క్యాబినెట్’గా కూడా పనిచేశారు.