ముంబై, డిసెంబర్17(నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో నాగ్పూర్లోని ఓ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ఆరుగురు మహిళలు ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాగ్పూర్లోని బజార్గావ్ గ్రామంలో సోలార్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో ఆదివారం ఉదయం ఈ పేలుడు సంభవించింది. పేలుడు పదార్థాలను ప్యాకింగ్ చేసే పని జరుగుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం.