భువనేశ్వర్, జూన్ 17: ‘మోదీ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఎప్పటికీ దానికి ఓటేయకండి’ ఇదీ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత అగ్నిపథ్ పథకంపై ఓ ఆర్మీ అభ్యర్థి ఆగ్ర హం. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్లో అతని ఆవేదన.
ఆర్మీలో చేరి దేశ సేవ చేయాలని ఆ యువకుడి కల. కానీ అగ్నిపథ్ పథకం అతడి కలలపై నీళ్లు చల్లింది. అగ్నిపథ్తో త్వరలో జరుగాల్సిన ఆర్మీ పరీక్ష రద్దు కావడంతో మనస్తాపానికి గురైన ధనంజయ్ మొహంతి అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా తెంటెయ్ గ్రామంలో ఈ విషాదకర ఘటన జరిగింది. ఆర్మీలో చేరేందుకు చాలా ఏండ్ల నుంచి ధనంజయ్ శిక్షణ తీసుకుంటున్నారు. అగ్నిపథ్ వల్లే తన కొడుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ధనంజయ్ తండ్రి ఆరోపించారు.