న్యూఢిల్లీ: ఢిల్లీలో బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మొదట స్కూళ్లు, తర్వాత ఎయిర్పోర్టులో బాంబులు పెట్టామని బెదిరించిన ఆగంతకులు ఇప్పుడు ఏకంగా కేంద్ర హోంశాఖ కార్యాలయాన్నే పేల్చేస్తామని బెదిరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆధీనంలో ఉన్న నార్త్ బ్లాక్లోని రోడ్ స్టోన్ బిల్డింగ్ను పేల్చేస్తామని ఈమెయిల్లో హెచ్చరించినట్టు తెలుస్తున్నది.
బాంబు స్కాడ్ తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదు. కాగా, ఈ నెలలో ఢిల్లీలోని దాదాపు 150 స్కూళ్లకు ఇలానే బాంబు బెదిరింపులు వచ్చాయి. హంగరీ రాజధాని బుడాపెస్ట్ నుంచి ఈ ఈమెయిళ్లు వచ్చినట్టు ఢిల్లీ పోలీసులు మంగళవారం వెల్లడించారు.