తిరుపతి: టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 13వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో జరుగనున్నాయి. కోవిడ్– 19 నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా శ్రీ బాలసుబ్రమణ్యం శాస్త్రీ పంచాంగ శ్రవణం చేస్తారు.
అనంతరం టీటీడీ ఉద్యోగుల పిల్లలతో వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.