బెంగుళూరు: కర్నాటక హైకోర్టులో ఇవాళ కూడా హిజాబ్ వివాదంపై విచారణ జరుగుతోంది. ఇస్లామిక్ సంప్రదాయంలో హిజాబ్ ధరించడం ముఖ్యమైన ఆచారం ఏమీ కాదు అని ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ తెలిపారు. ఉడిపి జిల్లాలో ఆరుగురు ముస్లిం అమ్మాయిలను కాలేజీలో అడ్డుకున్న ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హిజాబ్ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. హిజాబ్ అంశంలో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు ప్రభుత్వం స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాఠశాలలను, కాలేజీలను తెరిచారు. హిజాబ్ను ధరించడం ఇస్లాం మతంలో ప్రధాన అచారంగా భావించడంలేదని ఇవాళ అడ్వకేట్ జనరల్ తెలిపారు.