అహ్మాదాబాద్: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో దారుణమైన ప్రమాదం(Ahmedabad Accident) చోటుచేసుకున్నది. బుధవారం రాత్రి ఒంటి గంటకు గాంధీనగర్ హైవే వద్ద ఉన్న ఇస్కాన్ బ్రిడ్జ్పై జాగ్వార్ కారు బీభత్సం సృష్టించింది. ఆ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. వాస్తవానికి అంతకుముందే రోడ్డుపై మహేంద్ర థార్, ఓ ట్రక్కు ఢీకొన్నాయి. అయితే ఆ ఘటనను చూసేందుకు అక్కడ జనం గుమ్మిగూడారు. ఇంతలో ఈ జనాన్ని క్లియర్ చేసేందుకు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. అయితే ఆ సమయంలోనే ఫుల్ స్పీడ్ మీద వస్తున్న జాగ్వార్ కారు.. రోడ్డుపై ఉన్న వారిని ఢీకొట్టింది. వేగంగా వస్తున్న జాగ్వార్ కారు వీడియోను రోడ్డుకు మరోవైపు నిలుచుని ఉన్న వ్యక్తి తీశాడు. కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు పోలీసులు మృతిచెందారు. దాదాపు వంద కిలోమీటర్ల వేగంతో ఆ జాగ్వార్ వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. అయిదుగురు అక్కడిక్కడే మృతిచెందగా, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. ఆ ఘోర ప్రమాదానికి చెందిన వీడియో ఇదే.
Video of a biker travelling at SG HIGHWAY flyover, caught the video live when A jaguar Crashes 9 innocent lives. Very sad.#Ahmedabad #AhmedabadAccident #live pic.twitter.com/srpXPPmZWq
— Deep Zinzuwadia (@Deepzinzu) July 20, 2023
Flash:
Latest visuals of the prime accused, Tathya Patel, in car accident on ISKCON Bridge, #Ahmedabad.
He was taken to police station from CIMS hospital.#Gujarat #AhmedabadAccident pic.twitter.com/0VxfIP2PhG
— Yuvraj Singh Mann (@yuvnique) July 20, 2023