లక్నో, ఏప్రిల్ 7: రక్త పరీక్షతో గుండెపోటు ముప్పును ముందుగానే పసిగట్టొచ్చని, అలాగే తలకు అయిన గాయం తీవ్రత ఎంతో కూడా గుర్తించవచ్చని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. తద్వారా ఎమర్జెన్సీ రూమ్లో గడిపే సమయాన్ని తగ్గించవచ్చని వివరించారు. గుండెపోటు గుర్తింపునకు ఇప్పటికే ట్రోపోనిన్ I రక్త పరీక్ష వైద్యులకు అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఈ పరీక్ష ద్వారా గుండెపోటును గుర్తించడంతోపాటు, భవిష్యత్తులో గుండెపోటు వచ్చే ముప్పును కూడా అంచనా వేయొచ్చని పేర్కొన్నారు.