న్యూఢిల్లీ, ఆగస్టు 22: జలుబు, దగ్గు నివారణకు ఉపయోగించే క్లోర్ఫెనిరమైన్ మాలియేట్, ఫినైల్ఎఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ మిశ్రమం కలిగిన మందులను నాలుగేండ్ల లోపు వయసు గల పిల్లలకు ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. నిపుణుల కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్(డీటీఏబీ) సిఫార్సుల మేరకు శనివారం ఈ ఉత్తర్వును జారీచేసింది. ఈ ఔషధాల కలయిక వల్ల కలిగే ఆరోగ్యపరమైన ముప్పుల నుంచి చిన్ని పిల్లలను రక్షించడమే ఈ ఆంక్షల ఉద్దేశమని ప్రభు త్వం పేర్కొంది.
నిర్దిష్ట మిశ్రమాన్ని కలిగి ఉన్న మందుల ప్యాకేజింగ్, ప్యాకేజీలోని సమాచార పత్రాలు, ప్రచార సామగ్రిపై హెచ్చరికను ప్రముఖంగా ప్రదర్శించాలని ప్రభుత్వ ఔష ధ తయారీ సంస్థలను ఆదేశించింది. 4 సంవత్సరాల కంటే తక్కువ వయ సు ఉన్న పిల్లల్లో ఈ మందులను ఉపయోగించకూడదని స్పష్టంగా పేర్కొనాలని తెలిపింది.నిపుణులఅభిప్రా యం ప్రకారం ఈ మిశ్రమం చిన్న పిల్లలకు ఆరోగ్యపరమైన ము ప్పును కలిగించవచ్చు. అదేసమయం లో ఈ వయసు వారికి సురక్షిత ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.