ఫిరోజాబాద్, మే 27: స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేక అతని చితిలోకి దూకి తానూ కూడా ‘స్నేహ సహగమనం’ చేశాడు ఓ వ్యక్తి. యూపీలోని నాగ్ల ఖంగర్కు చెందిన అశోక్ (42) క్యాన్సర్తో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. మృతుని ప్రాణ స్నేహితుడైన ఆనంద్ (40) అంతిమ సంస్కారానికి హాజరయ్యాడు.
చితికి నిప్పంటించిన తర్వాత బంధువులు పక్కకు వెళ్లగా.. ఆనంద్ హఠాత్తుగా చితిలోకి దూకాడు. తీవ్రంగా గాయపడ్డ అతిడిని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు.