కోల్కతా: పశ్చిమబెంగాల్లోని సిలిగురి సఫారీ పార్కులోని ఉంచిన అక్బర్, సీత అనే సింహాల పేర్లు మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కలకత్తా హైకోర్టు మౌఖిక ఆదేశాలు జారీచేసింది. సింహాలకు ఆ పేర్లు పెట్టి ఎందుకు వివాదాన్ని రాజేశారని ప్రశ్నించింది. ఆడ సింహానికి సీత అని పేరు పెట్టడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బ తిన్నాయని వీహెచ్పీ వేసిన పిటిషన్పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏ మతానికి చెందిన దేవతల పేర్లను జూలోని జంతువులకు పెట్టొద్దని జస్టిస్ సౌగతా భట్టాచార్య మౌఖికంగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. త్రిపుర జూ నుంచి తీసుకొచ్చిన ఆ సింహాలకు అక్కడే ఆ పేర్లు పెట్టారని రాష్ట్ర సర్కారు కోర్టుకు వివరణ ఇచ్చింది.