చండీగఢ్ : ప్రముఖ హర్యాన్వి సింగర్ (Singer Dies) రాజు పంజాబి (40)మంగళవారం హిసార్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మరణించారు. గత కొద్దిరోజులుగా ఆయన ఆస్పత్రిలో కాలేయ సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆపై క్రమంగా రాజు పంజాబి ఆరోగ్య పరిస్ధితి క్షీణించడంతో ఆయనను వెంటిలేటర్పై ఉంచారు.
రాజు పంజాబి చివరి సారిగా ఈనెల 12న ఆప్సే మిల్కే యారా హంకో అచ్చా లగా థా అనే సాంగ్ను విడుదల చేశారు. రాజు పంజాబి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ సంతాపం వ్యక్తం చేశారు. గాయకుడి కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాజు పంజాబి మృతదేహానికి ఆయన స్వగ్రామం రవత్సర్ ఖేదాలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబంసభ్యులు వెల్లడించారు.
Read More :
Nuh violence | నూహ్లో ఎన్కౌంటర్.. మత ఘర్షణల నిందితుడి అరెస్ట్