Hacking | న్యూఢిల్లీ, జూన్ 28: స్మార్ట్ఫోన్లు వాడుతున్నవారిపై నిఘా (పేరెంటెల్ కంట్రోల్, ఎంప్లాయి మానిటరింగ్) కోసం ఉపయోగించే ‘లెట్ మీ స్పై’ యాప్పై హ్యాకర్లు దాడిచేశారు. యాప్ సర్వర్లపై హ్యాకర్లు దాడి చేశారని, అందులోని సమాచారమంతా తొలగించారని బుధవారం ‘లెట్మీ స్పై’ కంపెనీ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఫోన్ ట్రాకింగ్ స్పైవేర్గా పేర్కొనే ఈ యాప్ను భారత్ సహా పలు దేశాల్లో లక్షలాది మంది వినియోగదారులు వాడుతున్నారు. ఈనేపథ్యంలో సర్వర్లలో నిక్షిప్తమైన సమాచారమంతా హ్యాకర్లకు చేరిందని, ఈమెయిల్ అడ్రస్లు, టెలిఫోన్ నెంబర్లు, వినియోగదారుల వ్యక్తిగత సమాచారం నేరగాళ్లు చేతికి చిక్కే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు.