చండీఘడ్: హర్యానాలో దారుణ మర్డర్(Haryana Murder) జరిగింది. ఓ జిమ్ ఆపరేటర్ను సమీపం నుంచి కాల్చి చంపారు. ఈ ఘటన గురువారం ఉదయం హన్సి పట్టణంలో జరిగింది. మృతుడిని కపిల్గా గుర్తించారు. అతని వయసు 27 ఏళ్లు. జిమ్ కస్టమర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో అతను జిమ్ బయటే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటర్ బైక్పై వచ్చి సమీపం నుంచి అతన్ని కాల్చేశారు. కేవలం 5 సెకన్లలోనే 10 రౌండ్ల ఫైరింగ్ చేసినట్లు తెలుస్తోంది. కపిల్ను ఆస్పత్రికి తరలించినా.. అతని ప్రాణాలు దక్కలేదు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆ జిమ్ సమీపం వద్ద ఉన్న ఓ మహిళ గాయపడింది. ఆమెను హిసార్లోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. ఏ కారణం చేత జిమ్ శిక్షకుడిపై దుండగులు కాల్పులు జరిపారో ఇంకా పోలీసులు వెల్లడించలేదు. సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా పోలీసులు ఆ దుండగులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. జింద్ జిల్లాలోని దాలంవాలా గ్రామం బాధితుడి స్వస్థలం. హన్సీ పట్టణంలోని శాంతి నగర్లో అతను ప్రస్తుతం నివాసం ఉంటున్నాడు.
జిమ్ ఆపరేటర్ హత్య వెనుక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
In a shocking incident, a 25-year-old gym owner was shot dead by unidentified assailants in Haryana’s Hansi on Thursday morning in a brutal attack.
The victim, identified as Kapil, was outside his gym working out with a group of people when the bike-borne assailants opened fire… pic.twitter.com/w6WxINe3bu
— Hate Detector 🔍 (@HateDetectors) June 11, 2026