న్యూఢిల్లీ: ఇతర కస్టమర్లకు అంతరాయం కలుగుతుందంటూ, ఒక దివ్యాంగురాలిని రెస్టారెంట్లోకి అనుమతించలేదు. ఒక దివ్యాంగ యువతి పట్ల వివక్ష చూపిన ఈ ఘటన ఢిల్లీ శివారులోని హర్యానాకు చెందిన గుర్గావ్లో జరిగింది. చక్రాల కుర్చీకే పరిమితమైన సృష్టి పాండే, చాలా కాలం తర్వాత తొలిసారి సరదాగా స్నేహితులతో బయట గడపాలని భావించారు. శుక్రవారం రాత్రి తన బెస్ట్ స్నేహితురాలు, ఆమె కుటుంబ సభ్యులతో కలిసి గుర్గావ్లోని ప్రముఖ రాస్తా రెస్టారెంట్కు వెళ్లారు.
కాగా, దివ్యాంగురాలైన సృష్టి ఇబ్బంది పడకుండా ఉండేందుకు స్నేహితురాలి సోదరుడు ప్రత్యేకంగా నలుగురు కూర్చొనే టేబుల్ కోసం రెస్టారెంట్ సిబ్బందిని రిక్వెస్ట్ చేశాడు. అయితే రెస్టారెంట్ మేనేజర్ చాలా సేపటి వరకు వీరిని పట్టించుకోలేదు. చివరకు వీల్ చైర్ వ్యక్తులకు ప్రవేశం లేదని మేనేజర్ తెలిపాడు. లోపలున్న కస్టమర్లు డిస్టర్బ్ అవుతారని అన్నాడు. కావాలంటే బయట టేబుల్ తీసుకోవాలని చెప్పాడు.
ఈ ఘటనతో సృష్టి పాండే చాలా అప్సెట్ అయ్యారు. దివ్యాంగురాలిగా ఎదుర్కొన్న మరో చేదు అనుభవంపై తన ఆవేదనను ట్విట్టర్లో పంచుకున్నారు. ‘నేను, నాలాంటి దివ్యాంగ స్నేహితులు ఇలాంటివి చాలా ఏండ్లుగా ఎదుర్కొంటున్నాం. ఒక సిబ్బంది లేదా రెస్టారెంట్ గురించి కాదు. ఇది ఒక వ్యవస్థగా మారిపోయింది. ఇది నాకు మొదటిసారి కాదు. అయితే నేను దీని గురించి మాట్లాడటం ఇదే తొలిసారి’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు సృష్టి పాండే ట్వీట్ వైరల్ అయ్యింది. పలు మీడియా సంస్థలు ఆమెతో లైవ్ చర్చలు నిర్వహించాయి. దీంతో ఆ రెస్టారెంట్ దీనిపై స్పందించింది. రెస్టారెంట్ వ్యవస్థాపకుడు గౌమతేష్ సింగ్ ఆమెకు ట్విట్టర్ ద్వారా క్షమాపణ చెప్పారు. మరోసారి ఇలా ఎవరికీ జరుగకుండా అంతర్గతంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
కాగా పోలీసులు కూడా సృష్టి పాండేను సంప్రదించారు. దివ్యాంగురాలైన ఆమె ఎదుర్కొన్న వివక్షపై చర్యల కోసం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
— Srishti (she/her🏳🌈) (@Srishhhh_tea) February 12, 2022
#WATCH | Gurugram based differently-abled woman Shrishti Pandey alleges to have been denied entry into Raasta Gurgaon in the cyber hub by saying that "wheelchair won't go inside, because it will disturb other customers" pic.twitter.com/M5fb6y5rih
— ANI (@ANI) February 13, 2022
@Srishhhh_tea pic.twitter.com/eQZxqigPNF
— goumtesh Singh (@goumtesh) February 13, 2022