గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీకి అసోం కోర్టు బెయిల్ ఇచ్చింది. మహిళా పోలీసును వేధించిన కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. మహిళా పోలీసును వేధించిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాది గురువారం కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఎమ్మె ల్యే జిగ్నేశ్ మేవానీని అస్సాం పోలీసులు గత వారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్రమోదీపై వివాదాస్పద ట్వీట్ చేశారంటూ అస్సాంలో దాఖలైన కేసులో బుధవారం రాత్రి 11.30 గంటలకు పాలంపూర్లో అదుపులోకి తీసుకొని అసోం తరలించారు. అయితే ఈ విషయంలో కోర్టు బెయిల్ ఇచ్చింది. అంతలోనే అసోం పోలీసులు మరో కేసులు మేవానీని అరెస్ట్ చేశారు. తాజాగా అసోం కోర్టు బెయిల్ ఇచ్చింది.