తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ను విమానం ద్వారా బెంగళూరుకు తరలించారు. వరుణ్ సింగ్ విల్లింగ్టన్లోని మిలటరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక్కడి నుంచి ఆయన్ను అంబులెన్స్లో సూలూరు ఏయిర్ బేస్కు తరలించి, అక్కడి నుంచి బెంగళూరు కమాండ్ ఆస్పత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసమే తరలించినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ దుర్ఘటనపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంట్లో ప్రకటన చేస్తూ… గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ను బతికించుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామనిపేర్కొన్నారు. మరోవైపు వరుణ్ సింగ్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన తండ్రి కేపీ సింగ్ను విచారించగా… ప్రస్తుతానికి ఏమీ చెప్పలేనని, ఆయన్ను బెంగళూరుకు తరలిస్తున్నారని పేర్కొన్నారు.
ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో సహా 13 మంది మృతి చెందారు. ఈ దుర్ఝటన బుధవారం జరిగింది. అయితే హెలికాప్టర్లో ప్రయణించే సైనిక అధికారులలో ఒక్క వ్యక్తి మాత్రం సజీవంగా ఉన్నాడు. ఆయనే ఐఎఎఫ్ అధికారి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.