న్యూఢిల్లీ: సాధారణంగా పెళ్లిళ్లప్పుడు బారత్ సందర్భంగా వరుడు గుర్రంపై ఊరేగుతాడు. అయితే గుర్రం అందుబాటులో లేకపోవడంతో ఒక పెళ్లి కుమారుడు ఏకంగా గాడిదపై ఊరేగింపుగా పెళ్లికి వెళ్లాడు. ఫన్టాప్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ‘గుర్రం లేకపోతే ఏం గాడిద ఉందిగా’ అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోలో వరుడు గాడిదపై కూర్చొని ఉంటాడు. అతడి బంధువులు దాని ముందు డ్యాన్సులు చేస్తారు. మహిళలు కూడా హారతులు ఇస్తారు. అనంతరం వరుడు ఆ గాడిదపై ఊరుగుతూ పెళ్లి మండపానికి చేరుకుంటాడు.
కాగా, బారత్ సందర్భంగా వరుడు గాడిదపై ఊరేగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు కూడా ఫన్నీగా కామెంట్లు చేశారు. లాఫింగ్ ఇమోజీలతో పాటు పలు జోకులు వేశారు. ‘ఇది నా స్నేహితుడి పెళ్లి’ అని ఒకరు కామెంట్ చేశారు. మరికొందరు ఆ వరుడికి తమ అభినందనలు తెలిపారు.