అభివృద్ధి చేసిన ఐఐటీ మండి పరిశోధకులు
న్యూఢిల్లీ, మార్చి 15: నీటి నుంచి భార లోహాలను వడపోసే బయోపాలిమర్ ఆధారిత అధునాతన ఫిల్టర్ను ఐఐటీ మండి పరిశోధకులు అభివృద్ధి చేశారు. ‘సొల్యూషన్ బ్లోయింగ్’ అనే పద్ధతి ద్వారా తాము ఈ ఫిల్టర్ను అభివృద్ధి చేశామని వెల్లడించారు. భారీ స్థాయిలో లోహాలతో కలుషితమైన నీటిని శుద్ధిచేసేలా పారిశ్రామిక స్థాయిలో ఈ సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు పరిశోధకులు ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర గనుల శాఖ ఈ పరిశోధనకు నిధులను మంజూరు చేస్తున్నది. భార లోహాలతో కలుషితమైన నీటి వల్ల అల్జీమర్స్, పార్కిన్సన్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నదని ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ సుమిత్సిన్హారాయ్ తెలిపారు.