కోల్కతా: పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ-గవర్నర్ మధ్య చెలరేగిన వివాదం రోజురోజుకు ముదురుతున్నది. యూనివర్సిటీల వైస్ చాన్సలర్లను గవర్నర్ నియమించడాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బ్రత్య బసు తప్పుబట్టడంపై గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ విరుచుకుపడ్డారు. ‘అర్ధరాత్రి వరకు వేచిచూడండి’ అంటూ హెచ్చరించారు. కాగా, తొలుత శనివారం మంత్రి బసు మాట్లాడుతూ యూనివర్సిటీల్లో తోలుబొమ్మల పాలన సాగుతున్నదని, విద్యావ్యవస్థను గవర్నర్ నాశనం చేస్తున్నారని విమర్శించారు.