అహ్మదాబాద్: స్టేషన్లోకి రైలు వస్తుండగా ఒక వృద్ధుడు రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. గమనించిన ప్రభుత్వ రైల్వే పోలీస్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఆ వృద్ధుడ్ని కాపాడాడు. (GRP Saves Elderly Man) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. గుజరాత్లోని వల్సాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో సూరత్-బాంద్రా టెర్మినల్ ఇంటర్సిటీ రైలు వాపి స్టేషన్లోకి వస్తున్నది. ఇంతలో రైలు పట్టాలు దాటేందుకు ఒక వృద్ధుడు ప్రయత్నించాడు. ఆ క్రమంలో అదుపుతప్పి రైలు పట్టాల మధ్యలో పడిపోయాడు. పైకి లేవలేక పోయాడు.
కాగా, ఒకవైపు రైలు వస్తుండటం, మరోవైపు వృద్ధుడు పట్టాలపై పడి ఉండటాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసు (జీఆర్పీ) వీర్భాయ్ మేరు గమనించాడు. వెంటనే స్పందించి ప్లాట్ఫారమ్ నుంచి రైలు పట్టాలపైకి దూకి పరుగున వృద్ధుడి వద్దకు చేరుకున్నాడు. రైలు కొన్ని మీటర్ల దూరంలో ఉన్నప్పటికీ తన ప్రాణాలు లెక్కచేయక పట్టాల మధ్యలో పడి ఉన్న వృద్ధుడ్ని కాపాడేందుకు ప్రయత్నించాడు. మరికొందరి సహాయంలో వృద్ధుడితోపాటు అతడు కూడా ప్లాట్ఫారమ్ పైకి చేరాడు. ఆ రైలు బారి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఆ రైల్వే స్టేషన్లోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Watch | An old man, attempting to cross the railway tracks at Vapi Railway Station, falls and gets trapped as the Surat-Bandra Intercity train approaches the platform. In a quick response, GRP Jawan Veerabhai rescues the old man, bringing him to safety on the platform. pic.twitter.com/vXuiIq8rqP
— DeshGujarat (@DeshGujarat) November 23, 2023