న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఛఠ్ పండుగకు ముందు యమునా నదిలో నురగ (ఫోమ్)ను తొలగించేందుకు ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ) ‘విషపూరిత’ రసాయనాన్ని ఉపయోగిస్తున్నట్టు ఆరోపించిన బీజేపీ ఎంపీ పర్వేశ్వర్మకు డీజేబీ క్వాలిటీ కంట్రోల్ విభాగం డైరెక్టర్ సంజయ్శర్మ దీటైన జవాబిచ్చారు. కంటెయినర్లో నింపిన యమునానది నీటితో స్నానం చేసి ఆ ఆరోపణను తిప్పికొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను డీజేపీ వైస్ చైర్మన్, ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ ట్విట్టర్లో పోస్టు చేశారు. యమునా నదిలో డీఫోమర్ను చల్లడంపై శర్మతో వర్మ వాదనకు దిగడంతోపాటు యమునా నదిలో స్నానం చేయాలంటూ శర్మను సవాల్ చేసిన దృశ్యం ఆ వీడియోలో కనిపిస్తున్నది. ఈ ఘటనపై శర్మ శుక్రవారం కలిండి కుంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.