న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ఫేక్ న్యూస్ను వ్యాప్తి చేస్తున్నాయని 22 యూట్యూబ్ చానళ్లను కేంద్ర సమాచార, ప్రసార శాఖ బ్లాక్ చేసింది. వీటిలో భారత్కు చెందిన 18, పాకిస్థాన్కు చెందిన 4 చానళ్లు ఉన్నాయి. ఇవి దేశ భద్రత, విదేశీ సంబంధాలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నాయని కేంద్రం పేర్కొంది.
కాగా, యూట్యూబ్ చానళ్లతో పాటు మూడు ట్విట్టర్ ఖాతాలు, ఒక ఫేస్బుక్ ఖాతా, ఒక న్యూస్ వెబ్సైట్ను కూడా బ్లాక్ చేసింది. కొత్తగా తీసుకొచ్చిన ఐటీ రూల్స్-2021 అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయ యూట్యూబ్ చానళ్లను బ్లాక్ చేయడం ఇదే తొలిసారి.