చెన్నై: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ చెన్నైలోని అశోక్ నగర్లోని తన ఇంటిని విక్రయించారు. నటుడు మణికందన్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. సుందర్ పిచాయ్ 20 ఏండ్ల వయస్సు వరకు ఈ ఇంట్లోనే ఉన్నారు. పిచాయ్ తల్లిదండ్రులు కూడా అమెరికాలో స్థిరపడినందున చెన్నై నివాసాన్ని విక్రయించారు.
ఇంటి డాక్యుమెంట్లు అందిస్తున్నప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారని మణికందన్ చెప్పారు. పిచాయ్ పేరును ఎక్కడా వాడవద్దని తనతో చెప్పినట్టు ఆయన వివరించారు.