సాధారణంగా స్వీట్స్ అంటే కిలో వెయ్యి లేదా రెండు వేలు ఉంటాయి. అవి కూడా క్వాలిటీ స్వీట్లు అయితే. మామూలు స్వీటు షాపులో రెండు మూడొందలకే కిలో దొరుకుతాయి. కానీ.. ఈ స్వీటు షాపులో మాత్రం కిలో స్వీటు కొనాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిందే. ఆ స్వీట్ టేస్ట్ చేయడానికి కూడా ఇవ్వరు. ఎందుకంటే.. ఒక్క చిన్న ముక్క తినాలన్నా వందల రూపాయల విలువ ఉంటుంది. ఇంతకీ ఆ స్వీట్ పేరు ఏంటి? ఎందుకు దానికి అంత ప్రత్యేకత అంటారా? అది గోల్డ్ ప్లేటెడ్ మిఠాయి. అంటే ఆ స్వీట్ను గోల్డ్ పేపర్తో తయారు చేశారు.
ఇప్పటి వరకు సిల్వర్ పేపర్తో తయారు చేసిన స్వీటు తినే ఉంటారు మీరు. ఇది మాత్రం గోల్డ్ పేపర్తో తయారు చేసింది. ఈ మిఠాయిని ఢిల్లీలోని షాగున్ మిఠాయి షాపులో అమ్ముతున్నారు. దీని ధర ఎంతో తెలుసా? కిలో రూ.16,000. వామ్మో అంత ధరా అని నోరెళ్లబెట్టకండి. అంత ధర అయినప్పటికీ.. కస్టమర్లు ఆ షాపులో క్యూ కట్టి మరీ ఆ స్వీట్ను కొనుగోలు చేస్తున్నారు. ఆ స్వీట్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.