న్యూఢిల్లీ, మార్చి 14: వెజ్ పిజ్జాకు ఆర్డర్ చేస్తే నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేశారని, అందుకు పరిహారంగా కోటి రూపాయలు చెల్లించాలని అమెరికా రెస్టారెంట్ ఔట్లెట్పై ఓ మహిళ వినియోగదారుల కోర్టును ఆశ్రయించారు. యూపీలోని ఘజియాబాద్కు చెందిన దీపాళీ త్యాగి 2019 మార్చి 21న పిజ్జా కోసం ఆర్డర్ చేశారు. ఆ రోజు హోలీ. పిల్లలంతా ఆడుకొని ఆకలితో ఉండటంతో పిజ్జా అర్డర్ చేశారు. ప్యాకింగ్ తెరిచేసరికి అందులో నాన్వెజ్ పిజ్జా ఉంది. దీపాళీ కస్టమర్ కేర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె తన లాయర్ సహాయంతో వినియోగదారుల కోర్టుకెక్కింది. అమెరికా పిజ్జా కంపెనీ తన మత విశ్వాసాలను దెబ్బతీసిందని వాదించింది. దీనిపై కోర్టు పిజ్జా కంపెనీని వివరణ కోరింది. తదుపరి విచారణ బుధవారం జరుగనుంది.