గుణ (మధ్యప్రదేశ్), సెప్టెంబర్ 22: విద్యార్థినులతో టాయిలెట్లు క్లీనింగ్ చేయించిన ఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చోటుచేసుకొన్నది. జిల్లాలోని చక్దేవ్పూర్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న అమ్మాయిలతో శుభ్రం చేయిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దీంతో గురువారం ఆ రాష్ట్ర మంత్రి మహేంద్రసింగ్ సిసోడియా బాధ్యులైన స్కూల్ టీచర్లపై చర్యలకు ఆదేశించారు. ఈ ఘటన మంగళవారం జరిగిందని అధికారులు వెల్లడించారు. విద్యార్థినులతో టాయిలెట్లు కడిగించటంపై విపక్షాలు బీజేపీ సర్కారుపై భగ్గుమన్నాయి.