జైపూర్ : ఓ ముగ్గురు కామాంధులు మృతదేహాన్ని కూడా వదిలిపెట్టలేదు. సామూహిక లైంగికదాడి చేయడంతో ఆ బాలిక చనిపోయిందన్న విషయం తెలిసి కూడా.. వికృత చర్యకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన రాజస్థాన్లోని బుందీలో గతేడాది డిసెంబర్లో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
బుందీకి చెందిన 16 ఏండ్ల అమ్మాయి డిసెంబర్ 23వ తేదీన అదృశ్యమైంది. మేకలను మేపేందుకు అడవికి వెళ్లిన బాలికను.. ముగ్గురు యువకులు కిడ్నాప్ చేసి, సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను చంపేశారు. మృతదేహాన్ని కూడా వదిలిపెట్టకుండా.. కామంతో రగిలిపోయారు. ఆమె ప్రయివేటు భాగాల్లో 30 గాయాలు అయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. బాలికను చున్నీతో కట్టిపడేసి.. లైంగికదాడికి పాల్పడ్డారు.
ఈ సందర్భంగా బుందీ ఎస్పీ జై యాదవ్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనను తన జీవితంలో ఎప్పుడు చూడలేదు అని పేర్కొన్నారు. బాలిక పట్ల ముగ్గురు నిందితులు క్రూరంగా ప్రవర్తించారని తెలిపారు. బుందీ బార్ అసోసియేషన్ లాయర్లు కూడా నిందితుల తరపున వాదించబోమని చెప్పినట్లు ఎస్పీ యాదవ్ ప్రకటించారు.