న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ స్మారక కార్యక్రమంలో జర్మనీ మాజీ ఛాన్సలర్ ఏంజిలా మెర్కల్(Angela Merkel) ఉపన్యాసం చేయనున్నారు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జర్మనీ అండ్ ఇండియా ఇన్ టైమ్స్ ఆఫ్ గ్లోబల్ ఛేంజ్ అన్న టైటిల్తో లెక్చర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అంబాసిడర్ శివశంకర్ మీనన్, మెర్కల్ మధ్య కూడా సంభాషణ ఉండనున్నది. డాక్టర్ మన్మోహణ్ సింగ్ ట్రస్ట్ అండ్ ఫ్యామిలీ గురువారం మెర్కల్ రాక గురించి కన్ఫర్మేషన్ ఇచ్చారు. స్మారకోపన్యాసం చేసేందుకు మన్మోహన్ ఫ్యామిలీ మెర్కల్ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఆ ఇన్విటేషన్ ఇచ్చారు. 2005 నుంచి 2021 వరకు జర్మనీ ఛాన్సలర్గా మెర్కల్ చేశారు. జర్మనీ చరిత్రలో ఆ స్థానాన్ని అధిరోహించిన తొలి మహిళ ఆమె. అత్యధిక కాలం ఛాన్సలర్గా ఉన్న రెండో వ్యక్తిగా ఆమె రికార్డు క్రియేట్ చేశారు. 2022లో యూఎన్హెచ్సీఆర్ నాన్సేన్ రెఫ్యూజీ అవార్డును ఆమె అందుకున్నారు. 2024 డిసెంబర్ 26న మన్మోహన్ కన్నుమూసిన విషయం తెలిసిందే.