న్యూఢిల్లీ, మార్చి 15: ప్రసిద్ధ విద్యా సంస్థలలో ఇంజినీరింగ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం, కొన్ని ఎంట్రీ లెవల్ ఇంజినీర్ ఉద్యోగాల స్క్రీనింగ్ కోసం నిర్వహించే గేట్-2024 ఫలితాలు శనివారం విడుదల కానున్నాయి.
ఫలితాలను తమ అధికార వెబ్సైట్లో చూసుకోవచ్చునని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ సైన్స్ (ఐఐఎస్సీ) బెంగళూరు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు ఫలితాల స్కోర్ కార్డులను ఈ నెల 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని ప్రకటించింది.