లక్నో: గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ గురువారం గుండెపోటుతో మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్లోని బాందా వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ సునీల్ కౌశల్ తెలిపారు. బాందా జైలులో ఖైదీగా ఉన్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో జైలు అధికారులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సీఆర్పీసీ సెక్షన్ 144 ప్రకారం నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొచ్చారు. ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకూడదని పోలీసులు ఆదేశించారు. ముక్తార్ అన్సారీపై 60 క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నాయి. ఆయనకు శిక్షలు పడటం 2022 సెప్టెంబరు నుంచి ప్రారంభమైంది. ఎనిమిది కేసుల్లో వేర్వేరు కోర్టులు శిక్ష విధించాయి.