న్యూఢిల్లీ, మే 27: లగ్జరీ కారు కనిపిస్తే చాలు స్కానర్, అయస్కాంతం సాయంతో కారు డోరు తెరుస్తారు. జామర్తో జీపీఎస్ను ఆఫ్ చేస్తారు. హ్యాకింగ్ డివైజ్తో కారులో ఉన్న సాఫ్ట్వేర్ను మారుస్తారు. ఫార్మాట్ చేసి తమ సొంత సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేస్తారు. రెండు మూడు నిమిషాల్లో పనికానిచ్చేస్తారు.
ఏ మాత్రం హడావుడి లేకుండా కారును దొంగతనం చేస్తారు. హాలీవుడ్ సినిమా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ నుంచి ప్రేరణ పొందిన ముగ్గురు కార్ల దొంగతనానికి అనుసరిస్తున్న హైటెక్ విధానమిది. ఇలా ఢిల్లీలో 40కి పైగా కార్లను కొట్టేశారు. నిందితులు మనీశ్ రావు(42), జగ్దీప్ శర్మ(43), మహమ్మద్(40)లను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి రెండు పిస్టళ్లు, ఐదు కార్ట్రిడ్జ్లు, టూల్ కిట్లు, హ్యాకింగ్ పరికరం, 30 తాళం చెవులు, ఏడు కార్లను స్వాధీనం చేసుకొన్నారు.