ధర్మశాల, నవంబర్ 19: ఆధ్యాత్మిక గురువు దలైలామాకు ప్రతిష్ఠాత్మక ‘గాంధీ-మండేలా అవార్డు’ దక్కింది. శనివారం హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అవార్డుకు దలైలామా పూర్తిగా అర్హుడని చెప్పారు. అనంతరం దలైలామా స్పందిస్తూ కేవలం చర్చలు, శాంతితోనే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ రెండింటికి మించి ఆయుధం మరొకటి లేదన్నారు.